మన శరీరం పని తీరులో కిడ్నీ అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీర వ్యవస్థకు హానిచేసే వ్యర్థపదార్థాలను బయటకు పంపడంలో వడపోత గా అవి పని చేస్తాయి. శరీరం సాధారణ రీతిలో పని చేయడంలో ఎంతో ముఖ్యమైన బ్లడ్ ప్రెషర్ ను నిర్వహించడంలో, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలోనూ ఇవి తోడ్పడుతాయి. వేడి నుంచి ఉపశమనం కలిగించి వర్షాకాలం ఆనందం కలిగించినప్పటికీ, అదే సమయంలో అది ఎన్నోసాంక్రమిక వ్యాధులను కూడా వెంట తీసుకువస్తుంది. సూక్ష్మజీవులు పెరిగేందుకు, మన శరీరంలోని కణాలను నాశనం చేసేందుకు అది కారణమవుతుంది.
ఈ సీజన్ లో ప్రబలిపోయే వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈ కాలంలో వ్యాధులు ప్రబలిపోయేందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. కలుషిత నీళ్ళు, ఆహారం ఒకటైతే, మరో కారణం దోమలు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలు దోమలు వ ద్ధి చెందేందుకు అనువైన ప్రాంతాలవుతాయి. మలేరియా, లెప్టోస్పిరియోసిస్ (మెదడు పొరల వ్యాధి), డెంగ్యూ, టైఫాయిడ్, అక్యూట్ గ్యాస్ట్రోఎంటరిటిస్, హెపటైటిస్ ఎ, హెపటైటిస్ ఇ లాంటివి రెనల్ ఇన్ ఫ్లమేషన్ కు ప్రధాన కారకాలుగా ఉంటాయి. అవి కిడ్నీ వైఫల్యానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది.
ఈ సీజన్ లో ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేందుకు మరియు కిడ్నీ ఇన్ ఫెక్షన్ ను దూరం చేసుకునేందుకు ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు:
పరిశుభ్రంగా ఉండే పరిసరాలు హానికారక సూక్ష్మజీవుల పెరగకుండా చేస్తాయి. ప్రతి రోజూ తాకే లేదా ఉపయోగించే ఉపరితలాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
నీటిని మరగకాచి చల్లార్చి తాగాలి లేదా వాడేందుకు ముందు ఫిల్టర్ చేసుకోవాలి. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలేందుకు తాగునీళ్ళే ప్రధాన వనరుగా ఉంటాయి.
బయటి ఆహారపదార్థాలు అంత నాణ్యమైనవి కాకపోవచ్చు. కలుషిత నీళ్ళు, ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర పదార్థాలతో అవి తయారై ఉండవచ్చు. వ్యాధుల నుంచి దూరంగా ఉండాలంటే ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారపదార్థాలనే తినాలి.
ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అత్యంత సాధారణ వనరులు చేతులు. చేతులను సరైన విధంగా విధంగా శుభ్రపర్చుకోవాల. మరీ ముఖ్యంగా తినడానికి ముందు మరియు తిన్న తరువాత.
మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కూడా సూక్ష్మజీవులకు ఆవాసాలుగా ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ముప్పును ఇది తగ్గిస్తుంది.
తాజా పండ్లను అప్పటికప్పుడు ముక్కలుగా కోసుకొని తినాలి. ఎప్పుడో కోసిన ముక్కలను తినవద్దు. వాటిపై సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. పండ్లను తినే ముందు వాటిపై తొక్క తీసేయాలి. వాటిపై సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలో వర్షంలో తడిచి ఆనందించాలని అనిపిస్తుంటుంది. అలా చేస్తే, ఇంటికి రాగానే ఒళ్ళు బాగా శుభ్రం చేసుకోవాలి. వర్షంలో తడిచి రాగానే వస్తువులకు. వ్యక్తులను తాకవద్దు. అలా చేస్తే సూక్ష్మజీవులు వ్యాపించే అవకాశం ఉంటుంది.
ఇంటి వెలుపలే పాదరక్షలు వదిలేయండి. ఇంట్లోకి సూక్ష్మజీవులు ప్రవేశించకుండా జాగ్రత్తపడండి.
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ లెవల్స్ నియంత్రణ లో ఉండాలి. గ్లూకోజ్ అధిక స్థాయిలు ఈ వర్షాకాలంలో మీ కిడ్నీలను దెబ్బతీయవచ్చు.
- డాక్టర్ అజిత్ కుమార్ సింగ్,
నెఫ్రాలజిస్ట్, నెఫ్రో ప్లస్ డయాలిసిస్ సెంటర్,
సిలిగురి
Authorization