ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు గొంతు క్యాన్సర్ బాధితులు ఉండగా, అందులో ఒకరు భారతీయులే. ప్రపంచంలో మరేదేశంతో పోల్చినా...గొంతు క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య భారత్లోనే అధికంగా ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్న మరణాల కంటే గొంతు క్యాన్సర్ వల్లే 2020 నాటికి అధిక మరణాలు సంభవించనున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టడం తప్పనిసరిగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా చైనా, తైవాన్తో పాటుగా భారతదేశంలో గొంతు క్యాన్సర్ బాధితులు పెద్ద ఎత్తున పెరుగుతున్నారు. పురుషులతో పోలిస్తే, మహిళల్లో గొంతు క్యాన్సర్ విస్తరణ రెండు రెట్లు అధికంగా ఉంది. ముందుగా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించడం ద్వారా గొంతు క్యాన్సర్ బారినపడిన వారి సంఖ్య పెరుగుతున్నా.. ముందుగా గుర్తించడంతో ప్రాణాలు కాపాడుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
భారతదేశంలో సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో పురుషుల్లో గొంతు క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా, మహిళల్లో సంభవిస్తున్న క్యాన్సర్ మరణాల్లో గొంతు క్యాన్సర్ మూడో స్థానంలో ఉంది. పొగాకు ఉత్పత్తులు పెద్ద ఎత్తున వాడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గొంతు క్యాన్సర్ విస్తరిస్తోంది.
కారణాలు..
భారతదేశంలోని గొంతు క్యాన్సర్ కేసులకు పొగాకు ఉత్పత్తులే కారణం. గొంతు క్యాన్సర్ పెరిగేందుకు పొగాకు, పొగాకు ఉత్పత్తులను అధికంగా వాడటం ముఖ్య కారణం. ఆల్కాహాల్ సేవనం, హెచ్పీవీ, పొగరాని పొగాకు ఉత్పత్తులు అయిన గుట్కా కారణాలుగా ఉంటాయి. దీంతో పాటుగా బలహీనమైన పోషకాహారం కూడా ఒక కారణమే. తక్కువగా పండ్లు, కూరగాయలు స్వీకరించడం కూడా గొంతు క్యాన్సర్కు దారితీస్తోంది. వీటితో పాటు గొంతు క్యాన్సర్ పలు రకాలైన ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ల్యూకోప్లాకియా, ఎరిత్రోప్లాకియా, ఓఎస్ఎంఎఫ్, లిచెన్ప్లనస్, అల్సర్లు కూడా కొన్నిసార్లు కారణం అవుతాయి.
నిర్ధారణ పరీక్షలు..
రొమ్ము క్యాన్సర్ వలే సొంతంగా పరీక్ష చేసుకునే అవకాశం గొంతు క్యాన్సర్కు లేదు. ఎక్కువగా ముప్పు కలిగి ఉన్న వర్గాలైన పొగాకు వాడకం దార్లు, ఆల్కహాల్ తాగే వాళ్ళు, వక్కపొడి నమిలే వాళ్ళు, 30 సంవత్సరాల వయసు ఉన్న వారిలో గొంతు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. గొంతు క్యాన్సర్ను గుర్తించేందుకు తగు నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. జనాభా ఆధారంగా నిర్ధారణ పరీక్షలు చేయడం గొంతు క్యాన్సర్ విషయంలో సాధ్యం కాదు. ముందస్తుగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఇటీవలి కాలంలో గొంతు క్యాన్సర్తో సంభవిస్తున్న మరణాల్లో తగ్గుదల కనిపించడం శుభపరిణామం.
గొంతు క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించడం, తగు చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవచ్చు. మూడు వారాలకు మించి అల్సర్ ఉంటే ఫిజిషియన్ ద్వారా ప్రాథమిక వైద్యం చేయించుకోవాలి. అయినా తగ్గకపోతే లుకోప్లాకియా లేదా ఎరిత్రోప్లాకియా రాకుండా జాగ్రత్తగా ఉండాలి. సిటీ, ఎంఆర్ఐ లేదా పీఈటీ స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించి రోగ నిర్ధారణ చేస్తారు. సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా క్యాన్సర్ను తగ్గించుకోవచ్చు.
చికిత్స..
ప్రాథమిక దశలో ఉన్న గొంతు క్యాన్సర్కు శస్త్రచికిత్స , రేడియేషన్ ఆధారంగా చికిత్స చేస్తారు. అయితే చికిత్స అందించడానికి క్యాన్సర్ కణతి ఏర్పడ్డ ప్రాంతాన్ని ముందుగా పరిశీలిస్తారు. కొన్ని కణతులకు కీమోథెరపీ అవసరం లేకుండానే శస్త్రచికిత్స లేదా రేడియో థెరపీ ఆధారంగా వాటిని పూర్తి చేస్తారు. దీనికి రోగి ఆరోగ్య, మానసిక స్థితి బాగుండాలి.
సర్జరీ..
గొంతు క్యాన్సర్కు చికిత్సలో పలు ఇబ్బందులు ఉంటాయి. తొలిదశలోనే గుర్తించడం వల్ల సాధ్యమైనంత వరకు మందులు ద్వారానే నయం చేయవచ్చు. క్యాన్సర్ దశను బట్టి చికిత్సలోనూ మార్పు ఉంటుంది.కొందరు రోగులకు శస్త్రచికిత్స తప్పనిసరి అవుతుంది. శస్త్రచికిత్స ద్వారా కొందరిలో పలు సమస్యలు తలెత్తుతాయి.
సైడ్ ఎఫెక్ట్స్..
క్యాన్సర్ చికిత్సలో కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి చాలామందిలో వస్తాయి. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స తీసుకునే సమయంలో సైడ్ఎఫెక్ట్స్గా
చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఆస్టియోమైలిటిస్, ఫిస్టులా, హెమటోమా వంటివి సంభవిస్తాయి.
ప్లాస్టిక్ సర్జరీ ద్వారా గొంతులోని సమస్యలపైన మాట్లాడలేకపోడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు సహా ఇతరత్రా సమస్యలు పరిష్కరించవచ్చు.
రేడియోథెరపీ ద్వారా ఇతరత్రా సమస్యలు సైతం ఉంటాయి.
కొందరిలో రుచిని గ్రహించే గుణంలో మార్పులు, నొప్పి, బ్యాక్టిరియా/ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మం రంగు మారడం, డిస్పాజియా, వెంట్రుకలు రాలిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కీమోథెరపీ వల్ల వెంట్రుకలు ఊడిపోవడం, గొంతులో సమస్యలు, ఆకలి లేకపోవడం, గొంతు సమస్యలు, వాంతులు, డయేరియా మరియు తక్కువ రక్తం వంటి సమస్యలు తలెత్తుతాయని అయితే వీటిని సరిదిద్దవచ్చు.
జాగ్రత్తలు..
క్యాన్సర్ చికిత్స ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ సమస్యలను అధిగమించేందుకు సరైన శుభ్రత, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, ఇన్ఫెక్షన్ను అరికట్టడం, ఉత్తమమైన హైడ్రేషన్ కలిగి ఉండటం, ఎక్కువ క్యాలరీలు కలిగి ఉన్న పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చికిత్స అనంతరం కొంతకాలానికి సంభవించే దంతాల సమస్యలు, క్షిరోస్టోమియా, ఓఆర్ఎన్ సమస్యలను వైద్య సహాయంతో సమన్వయం చేయవచ్చు. చికిత్స పొందుతున్న రోగులు క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. రోగులలో వ్యాధికి సంబంధించిన లక్షణాలు తిరగబెట్టడం, రెండో దశ రోగ లక్షణాలు కనిపించబడం వంటివి సంభవిస్తాయని పేర్కొంటూ వీటిని సరిదిద్దేందుకు వైద్యుడిని నియమిత సమయం ప్రకారం సంప్రదిస్తూ వ్యాధి తిరగబెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
- డా||రేవంత్ గంగసాయి
కన్సెల్టెంట్, సర్జికల్ అంకాలజి
అవేర్ గ్లోబల్ హాస్పిటల్
Authorization