కొత్తిమీరపై జరిగిన ఒక కొత్త అధ్యయనంలో ఎన్నో నూతన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో కొత్తిమీరను చేర్చడం వల్ల మెదడు చురుగ్గా ఉండేందుకు కావల్సిన రసాయనాలు అందుతాయట. అంతేకాదు మూర్ఛ, ఇతర న్యూరో సంబంధ వ్యాధులను నివారించే శక్తి కొత్తిమీరకు ఉందట. ఇటీవల ఒక మెడికల్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం వివరాల ప్రకారం కొత్తిమీర (కొరియాండ్రం సాటివమ్) అత్యంత శక్తివంతమైన యాక్టివేటర్గా గుర్తించబడింది. సాంప్రదాయ వైద్యంలో కొత్తిమీరను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే రక్తంలోని పొటాషియం లెవల్స్ను సమం చేయడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది అన్నది ప్రయోగాత్మకంగా స్పష్టమైంది' అంటూ వివరిస్తున్నారు యుసిఐ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రిన్సిపాల్, ఫిజియాలజీ బయోఫిజిక్స్ ప్రొఫెసర్ జియోఫ్ అబోట్. సో.. మనం తీసుకునే ఆహారంలో కొత్తిమీరను చేర్చుకుంటే మంచిదే..!