పోషకాలు అధికంగా ఉండే ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పప్పులోనూ, కూరగాను తినపడటానికి చాలామంది పిల్లలు ఇష్ట పడరు. అలాంటప్పుడు వీటిని సన్నగా తరిగి చపాతీ పిండిలో కలపవచ్చు. వారంలో రెండు రోజులు జ్యూస్గా ఇవ్వవచ్చు. వీటిలో ఎక్కువగా ఉండే విటమిన్ 'కె' గాయాలు తగిలినప్పుడు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. కండరాలను బలంగా ఉంచడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక కప్పు ఆకుకూరల్లో విటమిన్ 'కె' ఎక్కువగా ఉంటుంది. - ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా, రక్త ప్రసరణ, అధిక రక్తపోటు అదుపులో ఉంటాయి. - అత్యధికంగా శాతం ల్యూటిన్ ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేసి చూపును మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. - ఒక కప్పు పచ్చిఆకుకూరల్లో విటమిన్ 'బి5' (ప్యాటోథొనిక్ ఆమ్లం) ఉంటుంది. విటమిన్ 'బి' శరీరానికి అవసరమైన శక్తిని, గ్లూకోజ్ను అందిస్తుంది. - పచ్చిఆకుకూరల్లో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. - ఆకుకూర శరీర బరువును అదుపులో ఉంచుతుంది. వీటిలో కొలెస్ట్రాల్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. క్రమం తప్పకుండా తింటే గుండె నొప్పి, క్యాన్సర్ వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. - ఆకుకూరల్లో ఉండే ఫోలిక్ ఆమ్లం, ఫైబర్, విటమిన్ 'సి', పోటాషియం, మెగ్నీషియం, ఫైటోకెమికల్స్, ల్యూటిన్, బిటా కెరోటిన్స్ వంటివి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు ఒక కప్పు పచ్చిఆకుకూరలను సలాడ్స్లో వేసుకుంటే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.