వైద్య రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. సర్జరీ చరిత్రలో సరికొత్త అధ్యాయనం చోటు చేసుకుంది. జాయింట్ రీప్లేస్మెంట్కు దేశంలోనే తొలిసారి ''నాల్గవ తరం'' రోబో అందుబాటులోకి వచ్చింది. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో నూతన ఒరవడికి సన్ షైన్ హాస్పిటల్ శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పోషకాల లోపం వల్ల కీళ్ళ అరుగుదల సమస్య అధికమవుతుంది. గతంలో వయసు పెరిగిన వారిలో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించేది. కానీ, ఇటీవల యువతలో కూడా దీని ప్రభావం ఉంటుంది. కారణాలు.. అధిక బరువు, నేలపై కూర్చొవడం, మెట్లు ఎక్కడం, సరైన పోషకాలు తీసుకోకపోవడం కీళ్ళనొప్పులకు కారణం అవుతోంది. మోకీలు పై ఒత్తిడి పెరిగి తొందరగా అరుగుతుంది.ఇలాంటి సమయంలో మోకీలు మార్పిడి అవసరం అవుతోంది. మోకీలు అరుగుదల నాల్గో దశకు చేరినపుడే మాత్రమే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. తక్కువ కోతతో రోబోటిక్-అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్ మెంటు అనేది కొత్తగా వచ్చిన శస్త్రచికిత్స విధానం. ఇందులో 'నాల్గవ తరం' రోబో సహాయంతో మోకాలి చిప్ప, తుంటి ఎముకల అరిగిన బాగాన్ని ఖచ్చితంగా అంచనావేసి కంప్యూటర్ నావిగేషన్ సహాయంతో సరైన పరిణామం నిర్ధారించుకుని, శస్త్రచికిత్స సమయంలో ఒక అంగుళం కూడా తేడా రాకుండా నిర్వహించి ఇంప్లాటను అమర్చడం వీలవుతోంది. దీని ద్వారా రోగికి మెరుగైన ఫలితాలతో పాటు, అతి తక్కువ రక్తస్రావం, త్వరగా కోల్కోవడం, హాస్పిటల్ నుండి అతి తక్కువ సమయంలో డిస్చార్జ్ వంటి అనేక సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య ప్రతి సంవత్సరం దాదాపు పదిహేను శాతం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త విధానం ద్వారా రోగికి మెరుగైన ఫలితాలు ఉంటాయి.