పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు. వీటిని తినడం వల్ల ఆయా సమయాల్లో వచ్చే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంచ్చని చెబుతుంటారు. సీజనల్గా వచ్చే రేగుపండ్లల్లో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి దూరం కావొచ్చు. - విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం ఇందులో అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల చాలా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. రేగు పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకి వెళ్తాయి. కాలేయం పని తీరు కూడా మెరుగు పడుతుంది. - ఈ పండులో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీని వల్ల కండరాలు, దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. కాబట్టి, చిన్నపిల్లలు, పెద్దవారు వీటిని తినడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. దీంతో.. వారికి ఎముకలు, దంతాలు బలహీనమయ్యేటువంటి సమస్యలు దూరం అవుతాయి. - రేగుపండ్లలో చర్మానికి మేలు చేసే ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. చర్మం కూడా కాంతులీనుతుంది. అందంగా మారాలనుకునేవారు వీటిని రెగ్యులర్గా తింటే చాలు.. స్కిన్ అందంగా, హెల్దీగా మారుతుంది. మచ్చలు, ముడతలు వంటి సమస్యలు దూరం అవ్వాలంటే ఈ పండ్లు తినాలని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. - రేగు పండ్లు తినడం వల్ల కాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. ఇందులోని గొప్ప ఔషధగుణాలు కాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను కూడా దూరం చేస్తాయి.