Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి కలెక్టర్ అమోరుకుమార్
ఇబ్రహీంపట్నం, కందుకూర్ మండలాల, ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ-కందుకూర్
మండలాల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని తహిసీల్దార్లను రంగారెడ్డి కలెక్టర్ అమోరుకుమార్ ఆదేశించారు. బుధవారం కందుకూర్ ఆర్డీఓ కార్యాలయంలో ఇబ్రహీంపట్నం, కందుకూర్ ఆర్డీఓ పరిధిలోని తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్వరమే భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. మోటేషన్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, విరాసత్, మీసేవ, ఆన్లైన్ సేవలు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రైతులకు రెవెన్యూ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు రైతులందరికీ అందేటట్టు చూడాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరీశ్, కందుకూర్ ఆర్డీఓ రవీందర్రెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.