Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొడంగల్
గ్రామాల్లో అపరిశుభ్రత నివారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రాలీ సైకిండ్లను బుధవారం ఎంపీపీ కన్నం దయాకర్రెడ్డి సర్పంచ్లకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ మండలాన్ని స్వచ్ఛ మండలముగా తీర్చిదిద్దేందుకు గాను, పారిశుధ్యలోపాలు నివారించేందుకు మండలానికి 35 ట్రాలీ సైకిండ్లు వచ్చాయని తెలిపారు. కొడంగల్కు 6, కొండారెడ్డిపల్లి 1, కస్తూర్పల్లి 1, ఇందనూర్ 1, హస్నాబాద్ 3, చిట్లపల్లి 2, అప్పాయిపల్లి 1, అన్నారం 1, అంగడిరాయిచూర్ 2, ఊడిమేశ్వరం 1, టేకుల్కోడ్ 2, రుద్రారం 3, రావల్పల్లి 2, ప్యాలమద్ది 1, పెద్దనందిగామ 2, పాతకొడంగల్ 1, పర్సాపూర్ 2, నాగారం 1, లక్ష్మీపల్లి 1, చిన్ననందిగామకు 1 చొప్పున స్వచ్ఛత ట్రాలీ సైకిండ్లను అందించామన్నారు. గ్రామ పంచాయతీ నిధుల ద్వారా కార్మికులకు వేతనాలు అందిస్తామని వెల్లడించారు. ప్రతీ గ్రామంలో స్వచ్ఛత పాటించాలని, కొడంగల్ మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరబ్రహ్మచారి, ఈవోపీఆర్డీ మధుసూదన్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు బాలరంగాచారి, భాగ్యలక్ష్మి, ఆంజనేయులు, బుగ్గప్ప, మురారీ, కొడంగల్ ఎంపీటీసీ నందారం రాజేందర్లతో పాటు సర్పంచ్లు శ్రీనివాస్రెడ్డి, మల్లీశ్వరి, పట్లోళ్ల దామోధర్రెడ్డి, తలారి ఆశప్ప పాల్గొన్నారు.