Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు రూరల్
బతుకమ్మ చీరల పంపిణీపై బుధవారం తాండూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలోని ఠాగూర్ హాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బతుకమ్మ పండుగ సందర్భంగా హిందువులకు చీరలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. బతుకమ్మ పండుగ ముందే చీరలు రేషన్ షాపుల్లో స్టాక్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. రేషన్ లబ్దిదారులు సరుకులు ఎక్కడ తీసుకుంటారో చీరలు కూడా అక్కడే తీసుకోవాలని అన్నారు. చీరల పంపణీ కార్యక్రమంలో డీలర్లతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి ఈ పంపిణీ చేసే విధంగా అధికారులు నిర్ణయించారు. కీ రిజిస్టర్ పరిగణలోకి తీసుకొని హిందువు మహిళలందరికి చీరలు అందేలా ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. కీ రిజిస్టర్లో ఎవరైనా పేర్లు నమోదు కాకపోతే వారు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నమోదు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంతోష్కుమార్, తహసీల్దార్ రాములు, ఎంపీడీఓ జగన్మోహన్రావు, ఆర్ఐ రవికుమార్, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.