Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
బీసీ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన బీసీల సంక్షేమ నిధి 102 కోట్లను వెంటనే విడుదల చేయాలని బీజేపీ బీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొప్పి సురేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు దాటిన బీసీలకు రుణాలు అందడం లేదన్నారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. వ్యక్తిగత రుణాలతోపాటు సోసైటీలకు అందించే రుణాలను కూడా మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మల్లేష్ యాదవ్, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.