Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయ సంఘాలు
నవతెలంగాణ-ధారూర్
సీసీఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ధారూర్ పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సతీష్కుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మండల విద్యాధికారికి సామూహిక సెలవు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలో జరిగే ర్యాలీలో అందరూ పాల్గొని, ధర్నాను విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ఆలోచించి, సీసీఎస్ను రద్దుచేయాలని కోరారు. సామూహిక సెలవుకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్ధ్దతు తెలుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. సామూహిక సెలవును సీసీఎస్కు వ్యతిరేక దినంగా పాటించాలని కోరారు. కార్యక్రమంలో టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విఠల్, టీపీయూఎస్ జిల్లా ప్రధానకార్యదర్ళి అంజిరెడ్డి, టీఎస్సీపీఎస్ఈఏ ధారూర్ అధ్యక్షుడు జనార్ధన్రెడ్డి, ప్రధాన కార్యదర్ళి రాఘవేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వికారాబాద్రూరల్
సీపీఎస్ రద్దుకోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు వేల సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చింది. సెప్టెంబర్-ఒకటి, 2017ను పింఛన్ విద్రోహ దినంగా ప్రకటించినందున వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అలంపల్లి చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపింది.ఉపాధ్యాయ ఉద్యోగ, కార్మికులు పెద్దఎత్తున ఉప్పెనలా తరలివచ్చి తమ నిరసనను తెలియజేయాలని కోరింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( టీఎస్యూటీఎఫ్ ) నాయకులు సీహెచ్. వెంకట్రత్నం, ఎన్. మహిపాల్రెడ్డి మాట్లాడారు. ర్యాలీ ఉదయం 10 గంటలకు అలంపల్లి చౌరస్తా యందు ప్రారంభ మౌతుందని తెలిపారు.