Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ ఎంవీ. రెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రో త్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంవీ. రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మం దిరంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పరిశ్రమలను నెల కొల్పేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు డీఆర్ డీఓ, జీఎండీఐసీ, డీపీఓ, ఎల్డీఎంలే కలిసి ఆదాయ, మార్కెట్ ఆధారిత పరిశ్రమలు స్థాపించేందుకు ప్రతిపా దనలు తయారు చేయాలని సూచించారు. రవాణా రం గం కాకుండా ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ రుణా లు మంజూరికీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించా రు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఎక్కువ మొత్తంలో రవా ణా వాహనాలు సబ్సిడీపై అందిస్తున్నారని, ఈ విధంగా అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపో వడంతో పాటు ట్రాఫిక్కు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు పరుస్తున్న స్టార్టప్, ముద్ర పథకాల కింద ఎస్టీలకు అవగాహన కల్పించి విరివిగా రుణాలు అందించాలన్నారు.
ఎస్సీలకు రెండు పరిశ్రమలు, 50 రవాణా వాహనా లను, ఎస్టీలకు ఒక పరిశ్రమ, 24 రవాణా వాహనాల మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమా వేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ రవీందర్, ఆర్డీఓలు హన్మంత్రెడ్డి, ముధుసూదన్, డీపీఓ సురేష్ మోహన్, డీఆర్డీఓ కౌటి ల్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జంగయ్య, డిక్కి ప్రతినిధి మునీందర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ సునీత, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధి కారి యూసుఫ్, ఎస్టీ సంక్షేమ అధికారి చత్రునాయక్ పాల్గొన్నారు.