Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అవుటర్ రింగ్ రోడ్డు లోపలున్న (ఓఆర్ఆర్) గ్రామాలకు త్వరగా తాగునీటి అందించేందుకు కృషిచేస్తున్నామని వాటర్ బోర్డు ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ అన్నారు. ఖైరతాబాద్లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఓఆర్ఆర్ ప్రాజెక్టుపై నిర్వహణ సంస్థలతో సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోర్డుకు చెందిన డీజీఎం, మేనేజర్లు ఓఆర్ఆర్ పరిధిలో పర్య టించాలన్నారు. వచ్చే వేసవి నాటికి ఓఆర్ఆర్ గ్రామాలకు పైపులైన్ల ద్వారా తాగునీటిని అందిస్తామని తెలిపారు. అలాగే రిజర్వాయర్ల నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని, కార్మికులను సిద్ధంగా ఉంచాలని నిర్వహణ సంస్థలకు ఆయన సూచిం చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్-2 డైరెక్టర్ డి.శ్రీధర్ బాబు, సీజీఎం పీఎల్ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.