Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
సీపీఎస్ అంతం ఉద్యోగుల పంతం కావాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పి.రఘునందన్రెడ్డి అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు పరచి పాతపెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వచ్చే నెల ఒకటో తేదీన శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాలో ఉపాధ్యాయులు,ఉద్యోగులందరు పాల్గొనాలన్నారు. సామాజిక సెలవు పెట్టి, పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు. దీనిలో భాగంగా కొండకల్ సీఆర్సీ సమావేశంలో సామూహిక సెలవు పత్రికలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, విద్యాకర్ మండల విద్యాధికారి సయ్యద్ అక్బర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2004 సెప్టెంబరు 1వ తేదీని ఖిలాఫత్ డేగా పాటించాలన్నారు. సీపీఎస్లో ఉన్న ఉపాధ్యాయులకు గ్రాట్యూటీ, ఫ్యామిలి పెన్షన్ ప్రమాదవశాత్తు మరణిస్తే ఉద్యోగి కుటుంబానికి భద్రత లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ మువీర్పాషా, ప్రధానా కార్యదర్శి దేవేందర్రెడ్డి ఉపాధ్యాయులు ఉన్నారు.
షాబాద్లో..
సీపీఎస్కు వ్యతిరేకంగా సెప్టెంబర్ ఒకటిన సామూహిక సెలవు పెట్టి నిరసన తెలుపనున్నట్టు పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టంబర్ 1న తలపెట్టిన ఫింఛన్ విద్రోహ దినం కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధికంగా పాల్గొని నిరసన తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది లక్ష్మీదేవి, రాజేందర్రెడ్డి, రవి, ప్రభాకర్, శ్రీను, సుగుణ, శ్రీలక్ష్మీ, నర్సింహులు, ఎల్లయ్య, చారీ, అజీజ్ ఉన్నారు.