Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామేల్
నవతెలంగాణ-చేవెళ్ల
రైతులు అవసరమైన గిడ్డంగులను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సామెల్ అన్నారు. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో గతేడాది నిర్మించిన గిడ్డంగులను ఆయన ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సేకరించిన 78వేల మెట్రిక్ టన్నుల కందులు, మరో 78 మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాంలలో నిల్వ ఉందని తెలిపారు. ప్రస్తుతం చేవెళ్ల గోదాంలో 3వేల మెట్రిక్ టన్నుల కందులు నిల్వ ఉన్నట్టు తెలిపారు. రైతులు పండించిన ధాన్యం నిల్వ ఉంచుకునేందుకు సరిపడా గోదాంలు లేక గతంలో ఇబ్బందులు ఉండేవని ఇప్పుడా సమస్య లేదన్నారు. అనంతరం మార్కెట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయలకీë, ఉపాధ్యక్షుడు మాసన్నగారి మాణిక్యరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారా యణరెడ్డి, నాయకులు యాదగిరి, రమేశ్రెడ్డి, ప్రభాకర్, రాంచంద్రయ్య, శర్వలింగం, సూపర్వైజర్ చంద్రయ్య, వెంకటమ్మ, నాగయ్య, డైరెక్టర్లు సతీష్, కృష్ణారెడ్డి ఉన్నారు.