Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఏసీఎస్ చైర్మన్ పాటి జగన్మోహన్రెడ్డి
నవతెలంగాణ-మొయినాబాద్రూరల్
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని పీఏసీఎస్ చైర్మన్ పాటి జగన్మోహన్రెడ్డి చెప్పారు. మండల కేంద్రంలోని సురంగల్-మొయినాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం రైతులకు దీర్ఘకాలిక రుణాల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన అన్ని రకాల రుణాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందన్నారు. పేద రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసమే పనిచేస్తుందని తెలిపారు. ఉచిత విద్యుత్తో రైతులు ఎంతో లాభదాయక పంటలు పండిస్తున్నారని చెప్పారు. రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, యంత్రాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులు ఆధునిక పద్ధ్దతులను అలవర్చుకొని, సాంకేతికంగా పంటలు పండించినట్టైతే ఆర్థికంగా అభివృధ్ధి చెందుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ గున్నాల రాంచంద్రారెడ్డి, డైరెక్టర్లు కొమ్మిడి వెంకట్ రెడ్డి, మేకల జంగయ్య, పోచయ్య, సురేందర్ గౌడ్, సీఈఓ మనోహర్ రెడ్డి, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.