Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షాద్నగర్ రూరల్
ఫరూఖ్నగర్ మండల పరిధిలోని చించోడ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. విద్యార్థులకు సరిపడా గదులు లేకపోవడంతో పాటు వరండాలో కూర్చొని తరగతులు వింటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, ఎప్పుడు కూలుతుందో తెలియక భయాందోళనలో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గదుల నిర్మాణానికి కృషి చేయాలని బీజేపీ మండల ఉపాధ్యక్షులు మిద్దె గణేష్, రుస్తుం లక్ష్మమ్మ, బాల్రాజ్, దామోదర్, ఎండి.సర్ధార్, రాంచందర్లు కోరారు.