Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏబీవీపీ ఆధ్వర్యంలో మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ - షాద్నగర్ రూరల్
విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం షాద్నగర్ పట్టణంలో విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కావలి శరత్కృష్ణ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలలకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలన్నారు. కడియం శ్రీహరి అసమర్థతతోనే విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయి, ప్రవీణ్, రాము, విజరు, సురేష్, మాణిక్యం, రమేష్, మోహన్, స్వప్న, నాగశ్రీ, మాణిక్యం, రమేష్, రెహనా, శ్రీకాంత్, గౌరీశంకర్ పాల్గొన్నారు.