Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూటీఎఫ్ మండల అధ్యక్షుడు మల్లయ్య
నవతెలంగాణ-ఆమనగల్
పెన్షన్ భిక్షకాదు ప్రతి ఉద్యోగీ హక్కు అని టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు ఎ.మల్లయ్య అన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సెప్టంబర్ 1న తలపెట్టిన పెన్షన్ విద్రోహదినానికి సంబంధించిన వాల్పోస్టర్ను బుధవారం మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సెప్టంబర్ 1న రాష్ట్ర రాజధానిలో అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ధర్నాలో ఉద్యోగుల ందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రామేశ్వర్రెడ్డి, యూటీఎఫ్ సీనియర్ నాయకులు పాండునాయక్, అంజ్యా, లక్ష్మి నారాయణ, రవికుమార్, శివలింగం, రవీందర్నాయక్, శ్రీను, పాల్గొన్నారు.