Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశాంతంగా ముగిసిన
- 2017మాక్ ఎన్నికలు
- ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం
- జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు వెెంకటరత్నం
నవతెలంగాణ- కోట్పల్లి
విద్యార్థులకు ఓటుహక్కుపై అవగాహన కలగాలని మండల పరిధిలోని జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల మోత్కుపల్లిలో బుధవారం మాక్పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులలో కొందరు ఎన్నికల్లో పోటీచేసి సాధారణ ఎన్నికలు తలపించే విధంగా ప్రచారం చేశారు. ఓటర్లను తమ తమ వైపు మల్లించుకోవడానికి అనేక వాగ్దానాలు చేశారు. ఎన్నికల కమిషనర్గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరత్నం బాధ్యతలు వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రతిఒక్కరూ ఓటు హక్కువినియోగిం చుకోవాలని సూచించారు. ఓటు ప్రజాస్వామ్యానికి వజ్రాయుధమని చెప్పారు. సమ సమాజ నిర్మాణానికి పనికి వచ్చే ప్రజాప్రతినిధులను గెలిపించి, దేశ అభివృధ్ధికి తోడ్పడాలన్నారు. పాఠశాల స్థాయి నుంచి ప్రజాస్వామ్య విలువలపట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఈ మాక్పోలింగ్ నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లిఖార్జున, సుమతి, నజ్మ,శోభారాణి నజీర, నరేందర్, మంజూల, తదితరులు పాల్గొన్నారు.