Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ ప్రజల పాలిట శాపం
- నిధులు మంజూరైన పనులు చేయించని ప్రజాప్రతినిధులు
- మురికి కాలువలేక ఇబ్బంది పడుతున్న ప్రజలు
నవతెలంగాణ-యాచారం
అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధులు అలసత్వం ఆ గ్రామ ప్రజల పాలిట శాపంగా మారింది. దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా మారింది. మండల పరిధిలోని ధర్మన్నగూడ గ్రామంలో మురికి కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం 2లక్షల రూపాయలు మంజూరు చేసింది. నిధులు మంజూరై ఆరు నెలలు కావస్తున్న ఇంతవరకు పనులు చేయడం లేదు. అధికారులను ప్రజాప్రతినిధులు అబస్థివాసులు పలుమార్లు అడిగిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో నాగటి సత్తయ్య ఇంటి నుంచి పేరుమండ్ల పోన్నాలు ఇంటివరకు మురికి కాలువ నిర్మాణం చేయాల్సి ఉంది. మురికి కాలువ లేక రోడ్డుపైనే మురుగు నీరు ప్రవహిస్తుంది. దీంతో ఈగలు, దోమలు ముసిరి ప్రజలు అంటు రోగాల భారీన పడుతున్నారని గ్రామస్తులు రమేశ్ తెలిపారు. ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిదులు మా సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని అన్నారు.