Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్ఎఫ్ నియోజక వర్గ ఇన్చార్జి నౌసు ప్రవీణ్
నవతెలంగాణ-మంచాల
ఏబీసీడీ వర్గీకరణ దిశగా ఎంఎస్ఎఫ్ అడుగులు వేస్తుందని ఎంఎస్ఎఫ్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గపు ఇన్చార్జి నౌసుప్రవీణ్ అన్నారు. బుధవారం మండల కేంద్రం ప్రభుత్వ కళాశాలలో ఎంఎస్ఎఫ్ కమిటీ వేశారు. ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడిగా గ్యారా శివకుమార్, ఉపాధ్యాక్షులుగా ఉబ్బులు అమెందర్, ప్రధాన కార్యదర్శిగా పృథ్వి, అధికారి ప్రతినిధి మహేశ్లను ఎన్నుకున్నారు. అలాగే మహిళా కమిటీ అధ్యక్షురాలుగా కొండిగారి తేజ, ఉపాధ్యాక్షులుగా జీ.పూజ, ప్రధాన కార్యదర్శిగా సుస్మిత, అధికార నందిని, కోశాధికారిగా మహేశ్వరిగా సుస్మిత, అధికార నందిని, కోశాధికారిగా మహేశ్వరి, కార్యదర్శిగా మౌనిక ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో దుబారం మండల ఇంచార్జ్ బండారివినోద్, ఎంఎస్ఎఫ్ నాయకులు, నాగరాజు, మహేశ్లు పాల్గొన్నారు.