Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన రైతులను కమిటీలో వేయాలి
- టీడీపీ మండల అధ్యక్షులు కుంకుడాల రాంరెడ్డి
నవతెలంగాణ-మంచాల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసే రైతు సమన్వయ కమిటీలో రాజకీయాల పార్టీల జోక్యం లేకుండా వేయాలని, అర్హులైన రైతులనే కమిటీలో ఎన్నుకోవాలని టీడీపీ మండల అధ్యక్షులు కుంకుడాల రాంరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 9 వరకు రైతు సమన్వయ కమిటీలు ప్రభుత్వం వేస్తుంది. అట్టి కమిటీలలో ఏలాంటి రాజకీయాలకు తావు ఇవ్వకుండా రైతులను సర్వే చేసి నిజమైన రైతులనే కమిటీలో వేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కార్యదర్శి యార మహేందర్ తదితరులు పాల్గొన్నారు.