Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పరిగి
ఉపాధి కార్మికుల అకౌంట్లకు ఆధార్ లింక్ చేయాలని ఏపీడీ విజయలక్ష్మి అన్నారు. పరిగి మండల ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ల సమావేశాన్ని ఎంపీడీిఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్బంగా పరిగి క్లస్టర్ ఏపీడీ విజయలక్ష్మి మాట్లాడుతూ ఉపాధిహామీ కార్మికుల అకౌంట్లకు ఆధార్ లింక్ చేయాలన్నారు. డబ్బులు రాని కార్మికుల లిస్ట్చేసి, వారితో కొత్త అకౌంట్లు తెరిపించి డబ్బులు వేయాలన్నారు. తప్పుగా ఉన్న అకౌంట్లను సరిచేసి వారి ఖాతాలో డబ్బులు వేయాలని సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద ప్రతీ గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా హరితహారం కార్యక్రమం కింద ప్రతీ గ్రామంలో మొక్కలు నాటి కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ రఫి, నాగేష్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.