Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీ చట్టం పీడీ ప్రశాంత్కుమార్రెడ్డి
- యాచారంలో ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ-యాచారం
విధి నిర్వహణలో ఉపాధి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే సహించేదని ఉపాధి హామీ చట్టం పీడీ ప్రశాంత్కుమార్రెడ్డి హెచ్చరించారు. బుధవారం యాచారం మండల కేంద్రంలోని ఉపాధి కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో యాచారంలో 40 వేల మొక్కలు నాటాలని ఆ పని ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. సిబ్బంది చెప్పిన సమాధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అనుకున్న లక్ష్యం ప్రకారం మొక్కలు ఎందుకు నాటాలేదని నిలదీశారు. టెక్నికల్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యం విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే వారిని రెగ్యులరైజ్ చేయడం కష్టమేనని అన్నారు. ఉపాధి పథకం కింద మండలంలో ఏఏ గ్రామాల్లో నాణ్యమైన పనులు చేశారో చుద్దామని అడుగగా ఎవ్వరూ నోరు మేదపలేదు. సిబ్బంది పని తీరుపట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఎంపీడీఓ రాంరెడ్డి, ఉపాధి ఎపీఓ నాగభూషణం సిబ్బంది పాల్గొన్నారు.