Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఫరూఖ్నగర్
విద్యార్థులకోసం ప్రత్యేక బస్సులు వేయడంతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులను నందిగామ మండల కేంద్రంలో ఆపాలని కోరుతూ డీఎంకు బుధవారం ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్కు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులు మండలంలో ఆపడంలేదని, దీంతో విద్యార్థులు ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్నగర్ - శంషాబాద్కు ప్రత్యేక బస్సులు వేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, ఎస్ఎఫ్ఐ నాయకులు సుమన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.