Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్వాన్నంగా ప్రభుత్వ పాఠశాలలు
- వేల నుండి వందలకు చేరుతున్న విద్యార్థుల సంఖ్య
- కనిపించని కనీస సౌకర్యాలు
నవతెలంగాణ-మర్పల్లి
స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు గడిచినా ప్రభుత్వ విద్యావ్యవస్థ గాడిన పడడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఎన్ని మారినా విద్యా వ్యవస్థలో మాత్రం పాఠశాలల భవనాలను కూల్చడం, నిర్మించడం మాత్రమే జరుగుతుందని పిల్లలకు కనీస సౌకర్యాలు మాత్రం కనిపించవంటున్నారు. రానురాను ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదాలు పొంచి ఉన్నాయంటున్నారు మరికొందరు. విద్యావేత్తలు పదేండ్ల కింద ప్రభుత్వ పాఠశాలల్లో వెయ్యి మంది వరకు పెద్దపాఠశాలల్లో ఉండేవారని అన్నారు. సంవత్సరం సంవత్సరం పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గిపోతుందన్నారు. దీనితో పాఠశాలలు మూతపడిపోతున్నాయి. పాఠశాలల్లో నాణ్యమైన విద్య ఇవ్వకపోవడం ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, ఉన్న కంప్యూటర్లను మూలకేయడం, ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. పాఠశాలకు వచ్చే పిల్లలను పట్టించుకునే వారు కరుయ్యారని ఉపాధ్యాయుల పిల్లలందరు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకనే ప్రైవేటు పాఠశాలల్లో వేస్తున్నారని అందుకే ఉపాధ్యాయుల నుండి అధికారులు, మంత్రులు వరకు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాటవాలను మారుస్తాం అని చెవులు చిల్లులు పడేలా అరుస్తునఆన ఎవ్వరు నమ్మడం లేదంటున్నారు. కనీసం మండలంలో ఏ ఒక్క పాటశాలలు కూడా తాగునీరు టాయిలేట్స్, ప్రయోగశాలలు వంటి సదుపాయాలు పూర్తిగా లేవు. ఒకే వాలంటరీతో కొన్ని పాఠశాలలు నడుస్తున్నాయి. మండలంలో 1 నుండి 10వ తరగతులు వరకు 5 పాఠశాలల్లో 4802 మంది విద్యార్థులకు 137 మంది ఉపాధ్యాయులు 103 మంది విద్యావాలంటీర్లు విద్యా బోధన చేస్తున్నారు. 300 మంది పిల్లలున్న దామస్తపూర్ పాఠవాలలో ప్రస్తుతం 1 నుండి 5వ తరగతుల్లో 32 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. ఎంత దారుణంగా ఉన్నయో ప్రభుత్వ పాఠశాలలు అంటున్నారు. ఒట్టి మాటలు కట్టిపెట్టి సౌకర్యాలు ఉపాధ్యాయులు భర్తీలు సదుపాయాలు కల్పించమంటున్నారు.