Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వశిక్షా అభియాన్ జేఏసీ
నవతెలంగాణ-మర్పల్లి
సర్వ శిక్ష అభియాన్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించి క్రమబద్దీకరించాలని జేఏసీ మండల అధ్యక్షురాలు ఎం.ప్రభావతి ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్వశిక్ష అభియాన్లో పని చేస్తున్న వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దార్ శ్రీనివాస్కు ఎంపీడీఓ నర్సింలుకు ఇంచార్జి ఎంఈఓ నర్సింలుకు వినతిపత్రం అందించారు. మర్పల్లి మండలంలో పని చేస్తున్న ఎంఐఎస్ కో ఆర్డినేటర్స్, డాటా ఎంట్రి ఆపరేటర్స్, సీఆర్పీఎస్, ఐఈఆర్పీఎస్, పీటీఐ, కేజీబీవీ, ఎస్ఓఎస్ గా చాలీచాలని వేతనాలలో పని చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. సమాన వేతనం ఇచ్చి వెంటనే క్రమబద్దీ కరించాలని మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రభుత్వ సెలవులు ఇవ్వాలని టీఏ.డీఏ అలవెన్స్ ప్రమాద భీమా బద్రత్త కల్పించాలని ఆరోగ్య బద్రతను కల్పించాలని 12 నెలల వేతనం ఇవ్వాలని సంవత్సరాని 22 సెలవులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. రవికిరణ్, యాదయ్య, రమేశ్, జ్యోతి, మహబూబ్, భారతి, మల్లేశం, పాపయ్యలు పాల్గొన్నారు.