Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ రూపాల్లో అలరించిన కళాకారులు
నవతెలంగాణ-ఆమనగల్
కడ్తాల్ మండల కేంద్రంలో వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన గణపయ్యలను బుధవారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. చండీశ్వర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనంలో కరీంనగర్కు చెందిన ఒగ్గు కళాకారులతో పాటు హన్మాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనంలో ఆదిలాబాదుకు చెందిన కుపోడి కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకర్శించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆయా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.