Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
- కిసాన్మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కోదండరెడ్డి
- ఫార్మాకు వ్యతిరేకంగా కందుకూరులో అఖిలపక్ష సమావేశం
- హాజరైన కాంగ్రెస్, సీపీఐ(ఎం), బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు
- ఫార్మాకు వ్యతిరేకంగా పోరాటం
- అఖిలపక్ష ఏకగ్రీవ తీర్మానం
నవతెలంగాణ కందుకూరు
ముచ్చర్లలలో ఫార్మాసిటీ ఏర్పాటును ఏట్టి పరిస్థితీలో నైనా అడ్డుకోవాలని కోరుతూ బుధవారం కందుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికీ కాంగ్రెస్తో పాటు సీపీఐ(ఎం), బీజేపీ, టీడీపీ పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. గజ్వేల్లో ప్రజలు తన్ని తరిమేస్తే ఫార్మా కంపెనీని తీసుకొచ్చీ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల యాచారం మేడిపల్లి ఆమన్గల్ మండలాల్లో ఏర్పాటు కోసం భూములు సేకరించారని మొదట 6 వేల ఎకరాలు అని ప్రస్తుతం 20 వేల ఎకరాలకు రైతుల నుంచి భూములు తీసుకొని ఫార్మా ఏర్పాటుకు కుటిల యత్న ం చేస్తున్నా సీఎం కేసీఆర్ ను తరిమికొట్టాలని అఖిలపక్ష ఏక గ్రీవ తీర్మాణంతో ముందు కొచ్చారు. ఈ సమావేశానికి విచ్చేసిన మాజీ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కోదండరెడ్డీలు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ముచ్యర్లలో ఐటీ పార్కు కోసం 400 ఎకరాల స్థలం, జూపార్కు లేదా ఫిల్మీం సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయ్యగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికీ పాటు పడుతారని చెప్పీ భూ దందా కోసం విష పూరితమైన ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రైతుల వద్ద బల వంతంగా కారు చౌకగా భూములు లాక్కోని ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఒక్క ప్రాజెక్టు నిర్మీంచాలంటే ఇక్కడి ప్రాంతం యొక్క ప్రజల అభి ప్రాయ సేకరణ చేయ్యాలి. పర్యావరణ లాంటీ అంశాలు పరిశీలించాలి. అలా కాకుండా సీఎం కేసీఆర్ ఆయన ఇష్టం వచ్చినట్టు భూమి సేకరించడం రాచరికమే అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వకుండా ఒక్కో ప్రాంతంలో ఒక్కో లాగా భూములకు ధరలు చెల్లించి రైతులను మోసం చేశారన్నారు. ఫార్మా ఏర్పాటు ఐతే ఎటూ 70 కిలోమీటర్లు భూమి, కాలుష్యం వాయువు కాలుష్యం, నీరు కాలుష్యం అయ్యి రైతులు పండించిన పంటలు పండక పోవడమే కాకుండా ప్రజలు ,జంతువులు పక్షులు బ్రతకం కష్ట తరమన్నారు. రైతులకు తక్కువ ధరలకు పరిహరం చెల్లించి టీఎస్ఎస్ఐ కీ ఎకరాకు 60 లక్షల చొప్పు న భూమి అమ్మి సొమ్ము చేసుకుంటుంన్నారని ఆరో పించారు. సెప్టెంబర్ నెల 18 న మేడిపల్లికి వచ్చే అధికారులను అడ్డగించడానికి అన్ని పక్షాల వారు సిద్దంగా ఉండాలని కోరారు. భవిష్యత్ తరాల కోసం విష పూరితమైన ఫార్మా సిటీనీ ఎట్టి పరిస్థితీలో ఏర్పాటు కాకుండా అడ్డు కోవడానికీ కంకణ ముగ్దులు కావాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శీ ఆచారీ, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి ,మాట్లాడుతూ కందుకూరు ఆమన్గల్ మేడిపల్లి ప్రజలే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు ఫార్మాకు వ్యతి రేకంగా పోరాటానికి సిద్దం కావాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రజలకు వ్యతి రేకంగా ఫార్మా తీసుకొచ్చీ గ్రామాలల్లో ప్రజలు నివసించకుండా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి గ్రామాల ప్రజలు ఇప్పటికైనా కండ్లు తెరవక పోతే రాబోయ్యో తరాల ప్రజలు రోగాల నొప్పులతో బానిసలుగా బతకాల్సీ వస్తుందన్నారు. ముచ్చర్ల ఫార్మా కు వ్యతిరేకంగా ఆనాడే పోరాటం చేసీ ఫార్మా కంపెనీనీ తరిమి కొడితే ఈ రోజు ప్రజలకు ఆందోళన ఉండేదీ కాదన్నారు. ఇప్పటి కైనా అఖిల పక్ష ఆధ్వర్యంలో ఏలాంటీ కార్యచరణ చేసీనా మా పార్టీ తరుపున ప్రజల తరుపున పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నాం అని భరోసా ఇచ్చారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శీ వర్గ సభ్యులు దుబ్బాక రాంచెందర్ మాట్లాడుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితో పాదయాత్ర చేశామన్నారు. మా పై పార్టీ కార్యకర్తలు నాయకులపై పోలీలు కేసులు నమోదు చేశారని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామన్నారు. ముచ్చర్ల ఫార్మాసిటీ ఏర్పాటు సమయంలో రైతుల వద్ద భూములు సేకరించేటప్పుడే అఖిల పక్ష ఆధ్వర్యంలో పోరాటం చేసీ ఉంటే సీఎం కేసీఆర్ వెనక్కి తగ్గే వారని అన్నారు. మా పార్టీ తరుపు ముచ్చర్ల ఫార్మా సిటీకీ వ్యతిరేకంగా 60 రోజులు నిరహర దీక్షలు చేయ్యడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటి కైనా అన్ని పార్టీల వారు ఐక్యమత్యంతో ఉండీ ఫార్మాను అడ్డుకొనీ సీఎం కేసీఆర్కు తగిన బుద్ది చెప్పాలని కోరారు. టీడీపీ జిల్లా నాయకులు ఇంజమూరీ రాంచెంద్రారెడ్డి మాట్లాడుతూ ఫార్మా కోసం రైతులను మోసం చేసి బలవంతంగా కారు చౌకగా భూములు తీసుకున్నారని అన్నారు. రైతులకు తక్కువ పరిహరం ఇచ్చారన్నారు. గ్రామాలల్లో గ్రామ సభలు నిర్వహించకుండా ఏక పక్షంగా భూములు సేకరించీ రైతులను నట్టేట ముంచారని అన్నారు. టీడీపీ తరుపున ఫార్మాకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికీ మా పార్టీ ఎల్లప్పుడు ముందు ఉంటుందని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, ఎంపీపీ అశోక్గౌడ్,కాంగ్రేస్ పార్టీ మండల అద్యక్షులు కృష్ణానాయక్, ఏ బ్లాక్ అధ్యక్షులు సురసాని సురేందర్రెడ్డి, డిల్లి శ్రీదర్ సత్తినేనీ వెంకట్రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శీ ఏ.కుమార్ బీజేపీ రాష్ట్ర నాయకులు బొక్క మాదవరెడ్డి, మండల అధ్యక్షులు సాద మల్లారెడ్డి, నల్ల బోలు నర్సింహరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు ఎగ్గిడి సత్తయ్య, వివిధ పసార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.