Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ మర్రి నిరంజన్రెడ్డి
- ఇబ్రహీంపట్నం సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతోపని చేయాలని ఎంపీపీ మర్రి నిరంజన్రెడ్డి, జడ్పీటీసీ పొట్టి ఐలయ్య అన్నారు.ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మర్రి నిరంజన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై ఎంపీటీసీలు అధికారుల దృష్టికి తెచ్చారు. రెవెన్యూ పట్టాదారు పాసు బుక్కులు ఇవ్వడం లేదని, తద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ ఐలయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి సాయం రావడం లేదని చెప్పారు. పంటరుణాలు ఇవ్వడం లేదని చెప్పారు. వెంటనే రైతులకు పట్టాదారుపాసు పుస్తకాలను జారీ చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో రూ.11వేల మంది రైతుల రైతుబంధుకు అర్హులు ఉన్నారని, ఇప్పటి వరకు రబీలో 6వేల మంది రైతులకు మాత్రమే రైతుబంధు సాయం అందజేయడం జరిగిందని ఏఓ వరప్రసాద్రెడ్డి తెలిపారు. ఆన్లైన్లో సమస్యల కారణంగా పూర్తి స్థాయిలో అందజేయలేకపోతన్నారని చెప్పారు. త్వరలోనే అందజేస్తామన్నారు. ఉద్వాన్నవనశాఖ ఆధ్వర్యంలో రైతులకు 50శాతం నుంచి 90శాతానికి డ్రిప్ను అందజేస్తున్నామన్నారు. కరువులో నీటి సమస్య ఉన్నందున ఆరుతడి పంటలను సాగు చేయాలన్నారు. ఆకుకూరలు, కాయకూరతోటలను వేయడం వల్ల ఆర్థిక నష్టం రాకుండా ఉంటుందని చెప్పారు. దండుమైలారం రోడ్డు పనులను సంవత్సరాల తరబడి చేస్తుండడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. అక్కడక్కడ కల్వర్టులు నిర్మించడం లేదన్నారు. వెంటనే పూర్తి చేయాలని జడ్పీటీసీ ఐలయ్య అధికారులను ఆదేశించారు. వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న వెల్మినేడులోని ఆరోగ్య కేంద్రంలో సమస్యలు పరిష్కరించేందుకు ఎంపీ దృష్టికి తీసుకుపోనున్నట్లు ఎంపీపీ మర్రి నిరంజన్రెడ్ది తెలిపారు. మిషన్భగీరథ దాదాపు అన్నిగ్రామాల్లో పూఇర్త చేయడం జరిగిందని ఆర్డబ్లూఎస్ అధికారులు తెలిపారు. కేవలం నాయినంపల్లి, రాందాస్పల్లి, కొంగరకలాన్లో గ్రామాల్లోనే వారం పది రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మార్చి నాటికి నీళ్లందిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మున్సిపాలిటీలుగా ఏర్పడిన గ్రామాల్లోనూ ఉపాధిహామీ పనులను కొనసాగించాలని సభ్యులు అధికారులను కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.11కోట్లతో పనులు ప్రారంభించనున్నామని ఏపీఓ లలిత తెలిపారు. వెంచర్ల మూలంగా పనులు ప్రారంభించలేకపోతున్నామన్నారు. అందుకు ఫారెస్టు అధికారుల అనుమతితో ఆయా ప్రాంతాల్లోనూ పనులు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొట్టి ఐలయ్య, ఎంపీడీఓ నరేందర్రెడ్డి, డీఈ శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలున్నారు.