Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమన్గల్
కారు ఢకొీని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయం సమీ పంలోని జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఏఎస్సై సీతారామ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తి మైసమ్మ దేవాలయం సమీపంలో ఉన్న రహదారిపై దాటుతుండగా హైదరాబాద్ నుంచి అమనగల్ వైపు వెళ్తున్న కారు బలంగా ఢకొీట్టింది. దీంతో ఆ వ్యక్తి ప్రమాద స్థలంలోనే మృతిచెందాడు. మృతిచెందిన వ్యక్తి వయస్సు సుమారు 60 ఏండ్లు ఉంటుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.