Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చాంద్రాయణగుట్ట
ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడ అరుంధతి కాలనీ ప్రాంతానికి చెందిన సోమ్లాల్ నాయక్(30) రోజు కూలి(లేబర్)గా పనిచేస్తుంటాడు. జనవరి 1వ తేదిన రోజు మాదిరిగా ఉదయం 7గంటలకు పనికోసమని బయటకు వెళ్లాడు. సాయంత్రం ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో అందోళన చెందిన కుటుంబికులు చుట్టపక్కల, స్నేహితులు, బందుమిత్రులతో వాకాబు చేశారు. ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసులకు భార్య సుగుణ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.