Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే కష్ణారావు
నవతెలంగాణ - బాలానగర్
భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని, డబుల్ ఇండ్లు కట్టిస్తామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శనివారం బాలానగర్ రాజు కాలనీ కమ్యూనిటీ హాలులో భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2019 సంవత్సరం క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నిత్యం అడ్డాల పై ఎండకు, వానకు, చలిలో వణుకుతూ, కూలీలుగా పనిచేసే కార్మికులకు కార్యాలయం లేక ఇబ్బందులుపడుతున్నారని చెప్పారు. అంతే కాకుండా విధులు నిర్వహించే సమయంలో ప్రమాదవశాత్తు మరణించినా, లేదా అంగవైకల్యం చెందినా నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పారు. వారికి పింఛన్లు అందజేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కాండూరి నరేంద్ర ఆచార్య, సీనియర్ ఉద్యమ నాయకులు ఆవుల రవీందర్ రెడ్డి, కష్ణమూర్తి, సీనియర్ సిటిజన్ రామచంద్రయ్య, వార్డు సభ్యులు శ్రీనివాస్ ముదిరాజ్, జె. రవీందర్, ఇతర పలువురు భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.