Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతారెడ్డి
నవతెలంగాణ- శంకరపల్లి
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతారెడ్డి అన్నారు. టీయూటీఎఫ్ శంకరపల్లి మండల శాఖ వారు స్టికర్ క్యాలెండర్ను శనివారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు బంగారు తెలంగాణ సాధన కోసం తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఉపాధ్యాయులు రాబోయే పదోతరగతిలో జిల్లాలోనే ఉత్తమ శాతాన్ని పెంచడానికి కృషి చేయాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానం వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘునందన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి డెవిడ్, మండలాధ్యక్ష, కార్యదర్శులు దేవందర్రెడ్డి, కె. నారాయణ, ఉపాధ్యక్షుడు నరేందర్రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి వరప్రసాద్, ఉపాధ్యాయులు మధన్రెడ్డి, మున్నీరపాష, రాముశర్మ, మొగులయ్య, వెంకటేశ్వర్రావు, ఫీరోజ్ పాల్గొన్నారు.