Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహశీల్దార్ షాహెదాబేగం
- రైతులకు రెండో విడుత పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
నవతెలంగాణ-దోమ
కొత్తగా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులుంటే వెంటనే రెవెన్యూ కార్యాలయంలో చెప్పాలని దోమ తహశీల్దార్ షాహెదాబేగం అన్నారు. శనివారం మండల రెవెన్యూ కార్యాలయంలో దోమ గ్రామానికి చెందిన మాలిస్ బిచ్చిరెడ్డికి పాసుపుస్తకం అందజేశారు. బిచ్చిరెడ్డికి మొదటి విడతలో పాసుపుస్తకం రాలేదు. దీంతో ఆయనకు రెండో విడుతలో పాసుపుస్తకం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తొలి విడతలో పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులు దొర్లితే తెలియపర్చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.