Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు భారత్దర్శన్కు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ కేశవులు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి, పాఠశాలకు, ఉపాధ్యాయులకు పేరు తెస్తున్న విద్యార్థులు వి. సిద్ధునాయక్ పదవ తరగతి, ఆర్. నవీన్నాయక్ పదవ తరగతి, కె.నారాయణ 9వ తరగతి, వి. ప్రవీణ్ 9వ, తరగతి, ఎన్. అఖిల్ 9వ, తరగతిలను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్. అఖిల్ ఖోఖోలో జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.