Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయాందోళనకు గురవుతున్న ప్రజలు
- త్వరలోనే సీసీ కెమెరాలు, బోన్ను ఏర్పాటు చేస్తాం
- అటవీశాఖ అధికారులు
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో చిరుతపులి మళ్లీ కలకలం రేపింది. గత ఐదు రోజులుగా చిరుతపులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారు. చిరుతపులి ఇప్పటివరకు మూడు మేకలను తిన్న విషయం తెలిసిందే... శనివారం గ్రామంలోని బైకని వెంకటయ్యకు చెందిన మేకను తిన్నది. బాధితుడు వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం ఎప్పటిలాగే వెంకటయ్య శుక్రవారం సాయంత్రం మేకలను మందల కట్టేసి భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు. తిరిగి అదేరోజు రాత్రి 12 గంటల ప్రాంతంలో మేకల దోడ్డికాడికి వచ్చి చూడగా మేక చనిపోయి ఉండటంతో మేకపై చిరుతపులే దాడి చేసి చంపినట్టుగా భావించి ఈ విషయాన్ని గ్రామస్తులతో కలిసి శనివారం ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
గ్రామానికి వచ్చిన అటవీశాఖ అధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆడపులిగా గుర్తించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ పులిని పట్టుకునేందుకు అటవీప్రాంతంలో సీసీ కేెమెరాను, బోన్ను అమర్చుతామని తెలిపారు. పులి అనవాలు కన్పిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.