Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం
అధ్యక్షుడు టి.పర్వతాలు
నవతెలంగాణ- ఆమన్గల్
గ్రామ అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామ కార్యదర్శుల సంఘం సెంట్రల్ ఫోరం అధ్యక్షులు తెలగమల్ల పర్వతాలు అన్నారు. మండలంలోని మాలేపల్లి (చెన్నంపల్లి) గ్రామానికి చెందిన పర్వతాలు ఉద్యోగ రీత్యా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లో నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో నేనుసైతం కార్యక్రమంలో భాగంగా తన స్వగ్రామంలో సీసీ కెమరాల ఏర్పాటు కోసం శనివారం ఆయన డాక్టర్లైన తన కూతుర్లు అనిత, నిశితలతో కలిసి స్థానిక ఎస్ఐ మల్లేశ్వర్కు రూ. లక్ష చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తమ వంతు సహాయంగా లక్ష రూపాయలను అందజేస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో సీసీ కెమరాల ఏర్పాటు కోసం పెద్దమొత్తంలో చేయూతనందించిన పర్వతాలు కుటుంబ సభ్యులను సీఐ నర్సింహ్మారెడ్డి, ఎస్ఐ మల్లేశ్వర్లు అభినందించారు.