Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేశంపేట
మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 8, 9తేదీల్లో జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ మహిళా శ్రామిక విభాగం కన్వీనర్ కవిత పిలుపునిచ్చారు. శనివారం కేశంపేట మండలంలో బీఎల్ఎఫ్ మండల కన్వీనర్ శ్రీనునాయక్ ఆధ్వర్యంలో సమ్మెకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో పెట్టాలన్నారు. కార్మిక చట్టం ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటమ్మ, సుజాత, సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.