Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్నగర్ రూరల్
ఫరూఖ్నగర్ మండల పరిధిలోని రాయికల్ రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ రాయికల్ గోపాల్రెడ్డి రూ.1లక్ష విరాళం ఏసీపీ సురేందర్కు అందజేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాత ముందుకు రావడం అభినందనీయమని ఏసీపీ గోపాల్రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీధర్, ఎస్ఐ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కిషన్నగర్లో..
ఫరూఖ్నగర్ మండల పరిధిలోని కిషన్నగర్ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరుతూ పోలీసులకు శివాజీచౌక్, ప్రజలు రూ.70వేలు, గ్రామస్తులు రూ.30వేలను విరాళం అందజేశారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.