Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేశంపేట
మండలంలో టీఎస్యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఎంఈఓ మనోహర్ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉండి క్యాలెండర్ ముద్రించడం సంతోషకరమని, సంఘాలుగా ఏర్పడి ఎన్నో హక్కులు సాధించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ కేశంపేట అధ్యక్షులు కృష్ణయ్య, ఉపాధ్యక్షులు రాంమోహన్, శ్యామలదేవి, ప్రధాన కార్యదర్శి రవికుమార్, ఉపాధ్యాయులు విశ్వప్రమోద్, సరిత, జ్యోతి, రమామహేశ్వరి, వినిత, శశికళ, అరుణ్జ్యోతి, జ్యోతి, సరిత, కవిత, తదితరులు పాల్గొన్నారు.