Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
నవతెలంగాణ- కొడంగల్ రూరల్
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయం వెంటనే విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షలు శ్రీనివాస్, ఉపాధ్యాక్షలు బుస్స చంద్రప్పలు ప్రభత్వాలను డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం కార్యకర్తల సమావేశంలో వారు దేశవ్యాప్త సమ్మె పోస్టరును విడుదల చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల8, 9వ తేదీలలో అఖిల భారత కార్మిక సంఘాల అధ్వర్యంలో నిర్వహించే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సవరిస్తూ యాజమాన్యాలకు మేలు చేసే విధంగా చేస్తున్నారని విమర్శించారు. మూతపడిన పరిశ్రమలను పట్టించుకోకుండా సాఫీగా సాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. ప్రస్తుతం నిత్యవసర ధరలు అడ్డూ అదుపులేకుండా పెరుగుతున్నప్పట్టికీ వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమైనట్టు తెలిపారు. కార్మికుల చట్టాల సవరణకు వ్యతిరేకంగా, నిత్యవసరాల ధరలను తగ్గించాలని కోరడంతో పాటు పలు డిమాండ్లతో దేశవ్యాప్త సమ్మెను చేపడుతున్నటు తెలిపారు. ఈ సమ్మెలో కార్మికులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరేందర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.