Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - షాద్నగర్ రూరల్
కొఠారి కమిషన్ను అమలు చేయాలని టీవీవీ రాష్ట్ర అధ్యక్షులు మద్దిలేటి అన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి కారణంగా అందరికీ అందాల్సిన విద్య కొందరికే పరిమితమవుతుందని ఆయన పేర్కొన్నారు. షాద్నగర్ పట్టణంలోని నూర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన 'విద్యా, రాజకీయ' శిక్షణా తరగతుల్లో మద్దిలేటి పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం కామన్ స్కూల్ విద్యా విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్పోరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ పరుస్తుండడంతో విద్య వ్యాపారంగా మారిపోయిందన్నారు. విద్యను కొని చదివే స్థోమతలేని ఎంతో మంది నిరుపేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో సైన్స్ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో మూఢనమ్మకాలు సైతం పెరిగిపోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందీప్, రంగారెడ్డి జిల్లా కన్వీనర్ ప్రవీణ్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.