Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జాన్సన్
- స్ఫూర్తి ప్రధాత లూయిస్ బ్రెయిలీకి ఘన నివాళి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికలాంగులను ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి జాన్సన్ అన్నారు. స్ఫూర్తి ప్రధాత లూయిస్ బ్రెయిలీ 210వ జయంతి వేడుకలను శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారులు. వికలాంగుల సంఘం నాయకులు బ్రెయిలీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి జాన్సన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వికలాంగుకు అన్ని రకాలుగా సహాయం అందిస్తుందన్నారు. ఈ సారి శాసనసభ ఎన్నికల్లో బ్రెయిలీ లిపితో వికలాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని గుర్తు చేశారు.
ఇకనుండి సదరన్ క్యాంపులను నెలకు నాలుగు సార్లు, తాండూరు, వికారాబాద్లో 2 సార్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే జిల్లా సమాఖ్య లాగా వికలాంగుల సమాఖ్యను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లూయిస్ బ్రెయిలీ చూపిన మార్గంలో నడిచి అభివద్ధి చెందాలని ఆయనకు రుణపడి ఉండాలని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి జ్యోత్స్న మాట్లాడుతూ 'అంధులకోసం లిపి' కనిపెట్టిన లూయిస్ బ్రెయిలీ కషి మరువలేనిదన్నారు. దీంతో ఎంతోమంది అంధులు ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు.
వికలాంగులు ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి హనుమంతరావు మాట్లాడుతూ బ్రెయిలీ లిపితో ఓటు హక్కు వినియోగించుకున్నారని, అలాగే జీవితంలో కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. శారీరకంగా ఆర్థికంగా తమ అనుభవాలతో అభివద్ధి చెందాలని సూచించారు. జిల్లాలో వికలాంగులకు సంగీతంతో పాటు విద్య కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల తో కేక్ కట్ చేయించారు. అనంతరం శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ మోతిలాల్, డీటీడీఓ కోటాజీ, ఆర్గనైజర్ సైదు బారు, సభ్యురాలు రజిత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.