Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభ్యర్థుల ఎంపికలో పార్టీల తలమునకలు
- రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
- ఎమ్మెల్యేలపై గురుతర బాధ్యత పోలింగ్ ఏర్పాట్లలో పంచాయతీరాజ్ అధికారులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పంచాయతీ పోరుకు పార్టీలు సై అంటున్నాయి. నేతలు తమతమ పార్టీల అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుంది. అందుకు జిల్లా పంచాయతీరాజ్ యంత్రాంగం ఆ ఏర్పాటులో తలమునకలైంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగంతో పాటు పోలీస్శాఖ సైతం బందోబస్తు ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఎప్పటికప్పుడు పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. మొదటి దశ ఎన్నికలు రెండు నియోజకవర్గాలోని 7 మండలాల్లో నిర్వహించనున్నారు. షాద్నగర్ డివిజన్లోని కొత్తూరు మండలంలో 12 గ్రామాలు, 110 వార్డులు. నందిగామ మండలంలో 18 గ్రామ పంచాయతీలు, 162వార్డులు, కేశంపేట మండలంలో 29 గ్రామాలు, 260 వార్డులు, కొందుర్గు మండలంలో 22 గ్రామ పంచాయతీలు, 186వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా చౌదరిగూడెం మండలంలో 24 గ్రామపంచాయతీలు, 204 వార్డులు. ఫరూక్నగర్లో 47 గ్రామ పంచాయతీలు, 410 వార్డులు, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలంలో 27 గ్రామపంచాయతీలు. 248 వార్డు లను కలుపుకొని. మొత్తం మొదటి దశలో 179 గ్రామపంచాయతీలతో పాటు 1,580 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడత ఎన్నికలకు 7వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచి అభ్యర్థులతో పాటు వార్డు సభ్యుల ఎంపిక ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. జిల్లాలో శాసన సభ ఎన్నికల్లో అధికార పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం వల్ల అదే స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని దిశగా పావులు కదుపుతోంది. ఈ తరుణంలోనే సర్పంచులుగా పోటీ చేసేందుకు ఒక్కో గ్రామంలో నలుగు రౖదుగురికి మించి పోటీ పడుతున్నారు. వారిలో సమర్థ వంతమైన నాయకు డిని ఎంపిక చేసుకునే క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట పడిన చందంగా మారిన కాంగ్రెస్ ఈ పంచాయతీ ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతోంది. వరుస సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం కింద అందించాల్సిన ఆర్థిక సహాయం ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. ఆన్లైన్ సమస్య ఉత్పన్నం కావడం ఒకవైపు అయితే మరోవైపు రైతుల బ్యాంకు అకౌంట్ సేకరించడంలో వ్యవసాయ అధికారులు తలకు మించిన భారం అవుతుంది. మరోవైపు రైతుల బ్యాంకు అకౌంట్లలో పెట్టుబడి సాయం జమ కాపాడినట్లు వారి వారి సెల్ఫోన్లకు మెసేజ్లు వచ్చినా.. బ్యాంకు ఖాతాల్లో మాత్రం డబ్బు జమ కావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదేమని ప్రశ్నించిన అధికారులను రైతులు ప్రశ్నిస్తే టెక్నికల్ సమస్య కారణంగా పడకపోయి ఉండవచ్చని సమాధానమిస్తూ దాటవేస్తున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికలు ఈ నెల 7వ తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నందున ఉపాధ్యా యులందరిని ఎన్నికల విధుల్లో నియమించారు. దాంతో ఈ విద్యా సంవత్సరంలో సిలబస్ పూర్తి కాక విద్యార్థులకు అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు రెండో విడత ఎన్నికలు జనవరి 25న ఉండడం వల్ల 26వ తేదీన జండా వందన పండగకు ఏర్పాటు చేసుకునేందుకు ఉపాధ్యాయులకు కాని పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఆ మరునాడు సెలవు తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఈ సారి రెండో విడత ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు అవకాశం లేకుండా పోతోంది.