Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలం పాటతో పంచాయతీలను దక్కించుకునే ప్రయత్నం
- పంచాయతీ ఎన్నికలపై ప్రధాన పార్టీల దృష్టి
- ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు
నవతెలంగాణ-తాండూరు
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతు న్నాయి. ఏకగ్రీవంగానే సర్పంచులను ఎన్నుకోవాలని నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. కాదని నామినేషన్లు వేస్తే ఊరుకునేది లేదని నాయకులు హెచ్చరిస్తున్నట్టు నియోజకవర్గం లోని బషీరాబాద్ మండలం బోజ్యానాయక్ తాండాలోని గ్రామ పంచాయతిలో చోటు చేసుకుంది. ఈ విషయమై గ్రామస్తులు మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. గ్రామంలో 12.5 లక్షలకు వేళం పాడామని ఇక ఈ ఎన్నికల్లో గ్రామంలో ఎవ్వరూ సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వెయ్యకూడదనీ కొందరు హెచ్చరిస్తున్నారనీ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామంలో నామినేషన్ వేస్తే కర్రలు విరుగుతాయని బెదిరిస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. నూతనంగా ఏర్పడిన గిరిజన తండాలను వేలం పాటల్లో దక్కించుకుని ఏకగ్రీవం చెయ్యాలనే ఆలోచనలో నాయకులు ఉన్నారనీ స్పష్టమవుతోంది. బషీరాబాద్లో జరిగిన పంచాయతీ వేలం పాటా నియోజకవ ర్గంలో చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల్లో తమకే మద్ధతు ఇవ్వాలంటూ ఆశవాదులు విందు తదితర కార్యక్రమాలతో ఒక వర్గాన్ని తయారు చేసుకునే పనిలోపడ్డారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడితో ఈ సారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నీ ఓటు నాకే వేయాలంటూ గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభించేశారు. ప్రధాన పార్టీలు పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. తమ వర్గం అభ్యర్థిని పంచాయతీ ఎన్నికల్లో గెలుపించుకుంటే రానున్న అన్ని రకాల ఎన్నికల్లో తమకే అనుకూలంగా ఉండేందుకు నాయకులు ఇప్పటి నుంచే గ్రామాల్లో పలు రకాల కసరత్తులు చేసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్షా లైన కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో రెండు పార్టీలు తమ అభ్యర్థులను గెలుపించుకుని ప్రజలు తమవైపునకు ఉన్నారనే భావనను కల్పించేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఏఏ రిజర్వేషన్ వస్తే ఎవరినీ పంచాయతీ బరిలో ఉంచాలనీ ప్రధాన పార్టీలు తమకు ఇప్పటి నుంచే పూర్తి సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలు అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ చెందిన స్థానిక నేతలకు అగ్ని పరీక్ష గా మారబోతున్నాయి. స్థానిక పంచాయతీ పోరులో గెలిచి నిలు వాలని నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. టీఆర్ ఎస్ ముఖ్య నాయకులకు తమ తమ గ్రామాల్లో ఈ ఎన్నికలు సవాలుగా నిలువనున్నాయి. మరో వైపు వచ్చే ఎంపీ, సోసైటి ఎన్నికలపై బోలేడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటిన వారికే మున్ముందు జరిగే ఎన్నికల్లో మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలుంటాయని నాయకులు నమ్ముతు న్నారు. పంచాయతీ ఎన్నికల్లో బోల్తా పడితే దాని ప్రభావం వచ్చే ఎన్నికలపై కూడా పడుతుందని వివిధ పార్టీల నేతలు ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. దాంతో ఖచ్చితంగా మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుపించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జరగబోయే పంచాయతీ పోరు గ్రామాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు కొనసాగనుంది. పంచాయతీ ఎన్నికలే పార్టీలకు భవిష్యత్ను తెలియ జేయవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.