Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శంషాబాద్
గ్రామ ప్రణాళికా కార్యక్రమం ప్రారంభమై 14 రోజులైందని గ్రామాలల్లో మరింతంగా ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు రంగారెడ్డి ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ తెలిపారు. గురువారం మండల పరిధిలోని రామాంజాపూర్ నుంచి నర్కూడ వరకూ కలెక్టర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే వర్షం అడ్డంకిగా మారడంతో బైకు ర్యాలీ మధ్యలోనే నిలిపివేశారు. అనంతరం మల్కారం, నర్కూడ గ్రామాలల్లో హరితహారం పథకం కింద మొక్కలు నాటారు. అధికారులు సర్పంచ్లతో మాట్లాడి ప్రణాళికలలో మిగిలిన రోజుల్లో గ్రామాల్లో మిగిలిన సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. శంషాబాద్ జెడ్పీటీసీ నీరటి తీన్వీరాజు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్, నర్కూడ సర్పంచ్ సునిగంటి సిద్దులు, మల్కారం సర్పంచ్, ఎంపీటీసీ తొంటగౌతమి అశోక్, ఎన్. కుమార్యాదవ్, గోదాసు విజయలక్ష్మీ, రామాంజాపూర్ సర్పంచ్ నర్సమ్మ, అధికారులు శేషగిరిశర్మ, సూర్యనారాయణ, శ్రీనీవాస్, శివప్రసాద్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్కూడలో పర్యటించిన అధికారులు గ్రామంలోని పాత ఇండ్లను కూల్చివేశారు. ఈ కూల్చివేతలో పంచాయతీ కార్యదర్శి శివ ప్రసాద్గౌడ్, నాయకులు పాల్గొన్నారు. మిగతా పాత వాటికి నోటీసులు అంద జేసినట్టు తెలిపారు. వాటిని కూడా త్వరలోనే కూల్చుతామని తెలిపారు.