Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్ నగర్ రూరల్
అండర్-17, అండర్-19 నేపాల్ అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన షాద్ నగర్ నియోజకవర్గం చౌదరిగుడ మండలంలోని కాసులబాద్, పెద్ద ఎల్కిచర్లకు గ్రామాలకు చెందిన శ్రీకాంత్ నాయక్, రాఘవేందర్, వివేకానందరెడ్డిలకు బీజేపీ నాయకులు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రూ.30వేలు, కక్కునూరి వెంకటేష్ గుప్త రూ.10వేలు, ఆకుల ప్రదీప్ రూ.2వేలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కబడ్డీ క్రీడకు ఎంపికైన యువతకు చేయుతనివ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజరు కుమార్, చిట్టెం లక్ష్మీకాంత రెడ్డి, ఆకుల ప్రదీప్, వెంకటేశ్వర రెడ్డి, ప్రకాష్ చారి, పాండురంగారెడ్డి, రమేష్, బాలకృష్ణ, రాగులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు శ్రీకాంత్ ఎంపిక
అభినందించిన ఎస్ఎఫ్ఐ నాయకులు
నేపాల్లో జరిగే అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులను గురువారం షాద్ నగర్ ఎస్ఎఫ్ఐ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కార్యాలయంలో కాసులాబాద్ గిరిజన తండాకు చెందిన శ్రీకాంత్ను సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్, నవీన్, పాండు, రాఘవేందర్, వేణు, సమీర్, శీను, శేఖర్, తదితర నాయకులు పాల్గొన్నారు.