Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
విద్యా కేంద్రంగా పేరుగాంచిన వికారాబాద్ జిల్లా కేంద్రంలో బడుగు బలహీన వర్గాలకు స్టడీ సెంటర్ను ఏర్పాటు చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకుఆనంద్ అన్నారు. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే మాట్లాడారు. వికారాబాద్ ప్రాంతం విద్యాభివ ద్ధికి నిలయంగా మారిందని, ఇప్పటి వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం బాధకరమన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్, కోట్పల్లి, బంట్వారం మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, వికారాబాద్, మోమిన్పేట్ మండల కేంద్రాలలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్లను నియమించేలా విద్యాశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో వైద్యపరంగా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే ప్రజల్లో ఒక నానుడి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వాస్పత్రికి రావాలంటే భయపడే పరిస్థితి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి మాత్రమే వెళ్తామనే అభిప్రాయం ప్రజల్లో నెలకొందని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆస్పత్రి ఉన్నప్పటికీ వెంటిలేటర్, తదితర సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే ఆస్పత్రిలో సామాగ్రి కల్పించాలని కోరారు. దీంతో మర్పల్లిలో అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. వికారాబాద్లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు మంచి ఆదరణ పొందాయని యావత్ భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని తెలిపారు.